అక్షరటుడే, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విఠల్ (40) మిషన్ భగీరథలో హెల్పర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం మహమ్మద్ నగర్ సమీపంలోని కాలువలో చేపలు పట్టడానికి వెళ్లి విఠల్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నీటి విడుదలను నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ శివారులో ఆయన మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
Advertisement
Advertisement