Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట పోలీస్​ స్టేషన్​లో​ పోస్టింగ్​ తీసుకోవడానికి ఎస్సైలు ముందుకు రావడం లేదు. రెండు నెలల వ్యవధిలో ఠాణాలో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి చిక్కడంతో ఇక్కడ చేరడానికి భయపడుతున్నారు. ఈ పోలీస్​ స్టేషన్​లో పోస్టింగ్​ కోసం గతంలో ఎస్సైలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ పనిచేసిన ఎస్సై గత నెలలో ఏసీబీకి చిక్కడంతో ప్రస్తుతం ఆ పోస్ట్​ ఖాళీగా ఉంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | నాగన్న బావిని సందర్శించిన విద్యార్థులు