అక్షరటుడే, భీమ్గల్: ఆంధ్రప్రదేశ్లోని నరసాపురంలో వైఎన్ కళాశాలలో నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో మనోళ్లు ప్రతిభ చూపారు. రాష్ట్రం నుంచి భీమ్గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకుడు పడిగెల సుదర్శన్, గంగాప్రసాద్ పాల్గొన్నారు. దీంతో ఉత్తమ కాంటిజెంట్ లీడర్గా సుదర్శన్, ఉత్తమ వాలంటీర్గా గంగాప్రసాద్ ఎంపికయ్యారు. దీంతో సోమవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ జి శ్రీనివాస్, అధ్యాపకులు లావణ్య, శంకర్, మొయినుద్దీన్, భూమన్న, రాజు, క్రాంతి కుమార్ , తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement