అక్షరటుడే, వెబ్డెస్క్ : TCS | భారత ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కీలక ప్రకటన చేసింది. ఇంజినీరింగ్ పట్టభద్రులు, సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి శుభవార్త చెప్పింది.
ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు tcs jobs భర్తీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 1.10 లక్షల మంది నిపుణులకు ప్రమోషన్లు tcs promotions కల్పించింది. ఈ ఏడాది కొత్తగా 42 వేల మంది ఫ్రెషర్స్ freshersను నియమించుకోవాలని టీసీఎస్ యోచిస్తోంది.
TCS | అనిశ్చితిలోనూ..
ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర IT Sector సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ Trump టారిఫ్ల భయం, స్వదేశీ నినాదంతో ఎక్కువగా ఐటీ కంపెనీలపైనే ప్రభావం పడనుంది. దీంతో ఇప్పటికే ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయితే సంక్షోభంలోనూ కొత్తగా 42 వేల ప్రెషర్లను నియమించుకోవాలని టీసీఎస్ భావిస్తోంది. ప్రారంభ స్థాయి ఉద్యోగుల కోసం టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ను నిర్వహిస్తోంది.
TCS | జీతాల పెంపు లేనట్లే..
ప్రస్తుతం అమెరికా America టారిఫ్ Tariffs ల భయంతో టీసీఎస్ ఉద్యోగుల వేతన పెంపుపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ ఏడాది వేతన వాయిదా పడినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం సంస్థలో 6,07,979 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వేతన పెంపు వాయిదా పడినప్పటికీ, కంపెనీ వేరియబుల్ పే చెల్లింపులను కొనసాగిస్తోంది.
TCS | తగ్గిన లాభం
టీసీఎస్ ఇటీవల తన క్యూ –4 q4 results tcs ఫలితాలను ప్రకటించింది. ఇందులో లాభం స్వల్పంగా తగ్గి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం మాత్రం 3.5 శాతం వృద్ధితో రూ. 61,237 కోట్లకు పెరిగింది.