Harish Rao | తెలంగాణ రైజింగ్ కాదు..ఫాలింగ్ : హరీశ్ రావు

తెలంగాణ రైజింగ్ కాదు..ఫాలింగ్ : హరీశ్ రావు
తెలంగాణ రైజింగ్ కాదు..ఫాలింగ్ : హరీశ్ రావు
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Harish Rao : రేవంత్ ప్రభుత్వం చేస్తోంది తెలంగాణ రైజింగ్ కాదని, తెలంగాణ ఫాలింగ్ అని ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గత ఆరేళ్లలో ఫిబ్రవరి జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి రేటు ఎప్పుడైనా 6 శాతం కన్నా ఎక్కువే ఉండేదని గుర్తుచేశారు. కానీ, రేవంత్ పాలనలో మాత్రం కరోనా కాలాన్ని గుర్తుచేస్తూ కేవలం ఒక్క శాతమే వృద్ధి నమోదైందని ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు. ఇది రేవంత్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.

హైడ్రా, మూసీ వంటి తలా తోక లేని నిర్ణయాల వల్ల 2024 ఆగస్టు తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. 2023 ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య అమ్ముడైన వాహనాలతో పోల్చితే.. 2024 ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య వాహన విక్రయాల వృద్ధి రేటు కేవలం 0.8 శాతమేనన్నారు. జీఎస్టీ ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికల్ ట్యాక్స్లో నెగెటివ్ వృద్ధి రేటు నమోదైందని తెలిపారు.

విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు స్కాలర్ షిప్ రాక బాధపడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు.

ఈ విషయంపై గత అసెంబ్లీ సమావేశాల్లో సర్కారును ప్రశ్నిస్తే.. స్కాలర్ షిప్ బకాయిల విడుదలకు మార్చి వరకు టైమ్ ఉందని మంత్రి సీతక్క సమాధానమిచ్చారని గుర్తుచేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై సర్కారుకున్న శ్రద్ధ.. పేద విద్యార్థుల చదువుల బకాయిల చెల్లింపులపై మాత్రం లేదని ఎక్స్ వేదికగా ఘాటుగా విమర్శించారు.

Advertisement