అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని మీసంపల్లిలో గల భద్రకాళి సమేత వీరభద్రస్వామి Sri Bhadrakali Sametha Veerabhadraswamy ఆలయ 23వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ విగ్రహాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి దక్షయజ్ఞం, రుద్రాభిషేకం, అగ్ని గుండాలు తదితర కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు చంద్రశేఖర్ అప్ప తెలిపారు. కల్యాణ మహోత్సవం Kalyana Mahotsavam తరువాత భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.