అక్షరటుడే, ఎల్లారెడ్డి:Lingampet |ఫ్లెక్సీ తొలగింపు వివాదం కారణంగా లింగంపేట(Lingampeta) మండల కేంద్రంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా వివిధ పార్టీల నాయకులతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించడంతో అంబేడ్కర్ సంఘం నాయకులు నిరసన తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులు, సంఘాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సీఐ(CI) తమపై దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంటూ నాయకులంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు(Police) లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు తదితరులను స్టేషన్కు తరలించారు. దీంతో అంబేడ్కర్ సంఘం నాయకులు చౌరస్తాలోనే విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.