అక్షరటుడే, వెబ్​డెస్క్: దేశంలోని ప్రజలందరికీ పెన్షన్​ వర్తించేలా కొత్త పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు అందరికీ పింఛన్​ అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని పథకాలను విలీనం చేసి కొత్త పథకం రూపొందించనున్నట్లు తెలిసింది. నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు, గిగ్​వర్కర్లకు ప్రస్తుతం పెన్షన్​ లేదు. కొత్త పింఛన్​ పథకంతో వీరికి మేలు జరగనుంది.

Advertisement

ఆ పథకాల స్థానంలో..

అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రస్తుతం అటల్​ పెన్షన్​ యోజన పథకం ఉంది. అయితే ఇందులో కార్మికులు ప్రతినెలా కొంత మొత్తం జమ చేస్తే కేంద్రం కూడా అంతే మొత్తం వేస్తుంది. 60 ఏళ్ల తర్వాత జమైన డబ్బుల ఆధారంగా పెన్షన్​ ఇస్తారు. అలాగే వీధి వ్యాపారుల కోసం ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్​ధన్​ యోజన, రైతుల కోసం కిసాన్​ మాన్​ధన్​ యోజన వంటి పెన్షన్​ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి స్థానంలో అందరికీ వర్తించేలా కొత్త పథకం తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

ఇది కూడా చ‌ద‌వండి :  Suprem Court | బిల్లుల‌పై గ‌డువులోగా నిర్ణ‌యం తీసుకోవాలి.. రాష్ట్ర‌ప‌తికి సుప్రీంకోర్టు సూచ‌న‌..

ఎన్​పీఎస్​పై ఆందోళన వద్దు

కేంద్రం కొత్త పింఛన్​ పథకం తీసుకు వస్తుందనే వార్తలతో ఎన్​పీఎస్​ (నేషనల్​ పెన్షన్​ స్కీం) రద్దు అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ పథకం అలాగే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న అందరికీ ఒకే తరహా పెన్షన్​ అమలు కోసం ఈ పథకం రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పింఛన్​ పథకాలను ఇందులో విలీనం చేస్తే కేంద్రం ప్రోత్సహించనుంది. దీంతో లబ్ధిదారులకు పింఛన్​ మొత్తం పెరిగే అవకాశం ఉంది.

Advertisement