అక్షరటుడే, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన ఇండెక్స్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఏ స్థాయిలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ గరిష్టంగా 1,281 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్లు నష్టపోయాయి. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,130 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా, ఐటీ, ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిం మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఐచర్ మోటార్స్, ఎయిర్టెల్ షేర్లు ఆరు శాతానికి పైగా పడిపోగా శ్రీరాం ఫైనాన్స్, బీఈఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా 3 శాతానికి పైగా నష్టంతో కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement