Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఛార్టడ్‌ అకౌంటెంట్‌ నవంబర్-2024 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://icai.nic.in/caresult/ లో ఫలితాలు తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన హేరంబ్‌ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్‌ 508 మార్కులతో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. 501 మార్కులతో రియా కుంజన్‌ కుమార్‌షా సెకండ్‌ ర్యాంక్‌లో నిలిచారు.

Advertisement