అక్షర టుడే, ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో గంగమ్మ గుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏఎంసీ ఛైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్ సత్యనారాయణ హాజరై ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సామెల్, శ్రీనివాస్‌ రెడ్డి, సర్ధార్‌ సింగ్, కిష్టయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement