అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎస్సై వేణుగోపాల్ గౌడ్ లంచం తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు ఎస్సై రూ.70 వేలు డిమాండ్ చేశాడు. మంగళవారం సాయంత్రం అయన డ్రైవర్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. గతంలో వేణుగోపాల్ గౌడ్ తాండూర్ పట్టణ ఎస్సైగా పనిచేశాడు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ACB | ఏసీబీకి చిక్కిన మార్కెట్​ కమిటీ సెక్రెటరీ