అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ పీహెచ్సీ పరిధిలోని ఆశా వర్కర్ల యూనియన్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడు నన్నేసాబ్ సమక్షంలో ఎన్నిక జరుగగా.. అధ్యక్షురాలిగా స్వప్న, ప్రధాన కార్యదర్శిగా రేష్మా, కోశాధికారిగా ఫర్జానా, వర్కింగ్ ప్రెసిడెంట్గా రమణి, కార్యవర్గ సభ్యులుగా పద్మ, సునీత, నాగమణి, మమత, అనిత, రుక్మిణి, సవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆశా కార్యకర్తల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని నూతన కమిటీ నాయకులు తెలిపారు.
Advertisement
Advertisement