DICHPAllI | ఎస్సీ వర్గీకరణపై నివేదికను సవరించాలి
DICHPAllI | ఎస్సీ వర్గీకరణపై నివేదికను సవరించాలి
Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: Dichpally | ఎస్సీ వర్గీకరణ నివేదికను తక్షణమే సవరించాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. దీనికి నిరసనగా మండల కేంద్రంలోని అంబేడ్కర్​ విగ్రహం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు డప్పులతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీలను ఏబీసీడీగా వర్గీకరించాలని పోరాడుతుంటే, డాక్టర్‌ షమీం అక్తర్​ ఏబీసీ అని నివేదిక ఇచ్చారన్నారు. దీన్ని సవరించి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, మండల ఇన్‌ఛార్జి నర్సయ్య, సంఘం కిష్టయ్య, సత్య అక్క, యమున తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Cabinet | ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం