Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్‌పై పోటీచేసి గెలిచిన పర్వేష్‌ వర్మ సీఎం రేసులో ముందున్నారు. అయితే సోమవారం నుంచి పీఎం మోదీ అమెరికా పర్యటన ఉండడంతో అంతలోపే సీఎం అభ్యర్థిని ఫైనల్‌ చేసేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రత్యేకంగా భేటీ కానుంది. సోమవారంలోగా ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement