అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | దొంగతనం జరిగిదంటే బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్తారు. కానీ ఈ దొంగలు డిఫరెంట్. ఇంట్లోకి చొరబడకుండానే చోరీలు చేస్తారు. అదేలా అనుకుంటున్నారా.. ఇంటి ముందు ఉన్న చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్తారు. హైదరాబాద్ – మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో బుధవారం రాత్రి చెప్పులు, బూట్ల దొంగలు హల్చల్ చేశారు.
మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్మెంట్లలో చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లారు. ఆటోలో వచ్చి మరి చెప్పులను సంచుల్లో నింపుకొని దర్జాగా వెళ్లిపోయారు. ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్, మహిళా ఎస్ఐకు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు, చెప్పులను సైతం చోరీ చేశారు. ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు, చెప్పులు కనబడకపోవడంతో ఆయా అపార్ట్మెంట్వాసులు షాక్ అయ్యారు. కాగా చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.