అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: election duties : ఇటీవల జరిగిన ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకు, అధికారులకు ఒకనెల గౌరవ వేతనం ఇవ్వాలని టీజీవో సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి అమృత్కుమార్ కోరారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుకు వారు వినతిపత్రం అందజేశారు.
స్పందించిన కలెక్టర్.. వెంటనే ప్రధాన ఎన్నికల అధికారికి జిల్లా నుంచి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు కలెక్టర్తో మాట్లాడుతూ కలెక్టరేట్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు IDOCలో సోలార్ ప్యానెళ్లలను ఏర్పాటు చేయాలని కోరారు. వాహనాల పార్కింగ్ కోసం షెల్టర్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సంఘం ప్రతినిధులు దేవి సింగ్, చందర్, దండు స్వామి, గంగాధర్, రామస్వామి, గోవర్ధన్, కీర్తిరాజ్ తదితరులున్నారు.