అక్షరటుడే, వెబ్డెస్క్ : Kashmir | జమ్మూ కశ్మీర్లో (Jammu and Kashmir) భద్రతా బలగాలు(Security forces) ముగ్గురు ఉగ్రవాదుల(Terrorists)ను అంతం చేశాయి. ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా కిస్త్వార్ జిల్లాలో జవాన్లు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపడుతున్నారు.
మూడు రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం ఒక ఉగ్రవాదిని, శనివారం మరో ఇద్దరు టెరరిస్టులను భారత జవాన్లు అంతం చేశారు. కాగా ఇందులో జైషే మహ్మద్(Jem) టాప్ కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నట్లు సమాచారం.