అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తిరుమల శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ జాకీయా ఖానం సిఫార్సు లేఖపై పొందిన టికెట్లను రూ.65 వేలకు భక్తులకు అమ్ముకున్నారు. టికెట్లను అధిక ధరకు అమ్ముకున్న ఎమ్మెల్సీపై ఓ భక్తుడు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో నిజమని తేలడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జాకీయా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్‌వో కృష్ణతేజ పేర్లను పోలీసులు చేర్చారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Pavan Kalyan | కుమారుడితో హైదరాబాద్​ చేరుకున్న పవన్​ దంపతులు