Encounter | ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్​ అగ్రనేత మృతి

Encounter | ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్​ అగ్రనేత మృతి
Encounter | ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్​ అగ్రనేత మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | చత్తీస్​గఢ్(Chhattisgarh)​లో జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్ట్​ అగ్రనేత జగదీశ్(Jagadeesh)​ మృతి చెందినట్లు సమాచారం. జీరామ్​(jeeram) ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. శనివారం ఉదయం సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు(Security forces), మావోయిస్టు(Maoist)లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 16 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలు అయ్యాయి. అయితే ఈ ఎన్​కౌంటర్​లో మావోయిస్టుల కీలక నేత జగదీశ్​ మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా జగదీశ్​​ భార్య గతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో మరణించింది.

Advertisement
Advertisement

Encounter | జీరామ్​ ఊచకోత కేసు..

ఛత్తీస్‌గఢ్‌లోని జీరామ్ లోయలో 2013 మే 25 మావోయిస్టులు భారీ ఘాతుకానికి పాల్పడ్డారు. కాంగ్రెస్​ నాయకుల కాన్వాయ్​పై దాడి చేశారు. నంద్‌కుమార్ పటేల్, విద్యాచరణ్ శుక్లా, మహేంద్ర కర్మ, ఉదయ్ ముదలియార్ వంటి ప్రముఖులతో సహా 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హత్య చేశారు. ఈ కేసులో జగదీశ్​ కీలక నిందితుడిగా ఉన్నాడు. తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో ఆయన మృతి చెందాడు. ఈ కేసులో మరో ప్రధాన నిందితురాలు మంజుల అలియాస్ నిర్మల గతేడాది నవంబర్​లో వరంగల్​ పోలీసుల ఎదుట లొంగిపోయింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో భారీ ఎన్​కౌంటర్​