అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ట్రాఫిక్ పోలీసులు నగరంలోని బస్టాండ్ వద్ద మంగళవారం వాహనాలను తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్ లేని 30 వాహనాలను సీజ్ చేశారు. సైలెన్సర్లను మోడీఫై చేసిన పది బైక్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి అవగాహన కల్పించి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు చంద్రమోహన్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement