అక్షరటుడే, వెబ్డెస్క్:TTD Budget | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనం(Annamayya Bhavan)లో టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరాని(financial year)కి బడ్జెట్ ఆమోదించనున్నారు.
రూ.5,400 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. పలు కీలక అంశాలపై ఈ మీటింగ్లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్(special trust) ఏర్పాటుపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే నిపుణుల కమిటీ చేసిన పలు సిఫార్సులకు మండలి ఆమోదం తెలపనుంది.
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక టీటీడీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.