అక్షరటుడే, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను గురువారం విడుదల చేశారు. 2025 ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ అధికారులు ఆన్లైన్లో విడుదల చేశారు. వర్చువల్ సేవల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రీలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను 23న ఉదయం పది గంటలకు, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీ వాణి ట్రస్ట్ టికెట్లను విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను 23న మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో పెట్టనున్నారు.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
Advertisement
Advertisement