Turmeric farmers | మద్దతు ధర కోసం పసుపు రైతుల ధర్నా
Turmeric farmers | మద్దతు ధర కోసం పసుపు రైతుల ధర్నా
Advertisement

అక్షరటుడే, ఇందూరు: Turmeric farmers | పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

తమకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పసుపు రైతులు సోమవారం నగరంలోని బస్టాండ్​ ఎదుట ధర్నాకు దిగారు. జిల్లాలో పసుపు పండిస్తున్న రైతులంతా మార్కెట్​ యార్డుకు వచ్చి అక్కడి నుంచి నేరుగా బస్టాండ్​ ఎదుట మండుటెండలో నిరసన చేపట్టారు. మార్కెట్​యార్డులో పసుపు పంటకు ధర రాకుండా వ్యాపారులు, దళారులు తమను మోసం చేస్తున్నారన్నారు.

 

ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. మరోవైపు నగరం నడిబొడ్డున రైతులు ధర్నాకు దిగడంతో నలుమూలలా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

 

Advertisement