అక్షరటుడే, ఇందూరు: POWER CUT | అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని వినాయక్నగర్ (VINAYAK NAGAR), పూలాంగ్ చౌరస్తా(PULANG CHOWRASTHA) తదితరల ప్రాంతాల్లో మధ్యాహ్నం కరెంట్ సరఫరా నిలిచింది. సుమారు 4 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలతో పాటు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
వాస్తవానికి విద్యుత్ కోతలపై అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చేవారు. కానీ, శుక్రవారం ఎలాంటి ప్రకటన చేయకుండానే కోత విధించారు. ఒకవైపు ఎండలు ముదిరిపోవడం.. మిట్ట మధ్యాహ్నం వేళ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విద్యుత్ అధికారులకు సంప్రదించినప్పటకీ.. స్పందన లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.