అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిజామాబాద్(ఇందూరు) పేరును ప్రస్తావించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. తెలంగాణకు కేటాయించిన నిధుల గురించి వివరించారు. ఇందులో భాగంగా పసుపు బోర్డు అంశాన్ని గుర్తు చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అలాగే ఇందిరా గాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసింది కూడా తమ ప్రభుత్వమేనని తెలిపారు. విభజన సమయంలో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పులకుప్పగా మారిందన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement