అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీలో కేటీఆర్‌, హరీశ్‌రావు పంచాయతీ నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఆర్‌కేహెచ్‌ (RKH అంటే రేవంత్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు) ప్రభుత్వం నడుస్తోందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం వీఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో ఈరోజు ఆయన మాట్లాడారు. రాజ్‌పాకాల మందు దందాలో దొరికితే.. బీఆర్‌ఎస్‌ నేతలు ధర్నా చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ లేకపోతే కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని పేదలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోబోమన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth reddy | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్‌..