అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మాజీ మంత్రి కేటీఆర్‌ పాదయాత్ర వార్తలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందిస్తూ ..ఆయనను తీవ్రంగా విమర్శించాడు. బండిసంజయ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తా అనడానికి సిగ్గు ఉండాలన్నారు. ఏం ఉద్ధరించారని పాదయాత్ర చేస్తా అంటున్నవ్‌ కేటీఆర్‌ అని ప్రశ్నించారు. ‘మేం పాదయాత్ర చేస్తే దాడులు చేశారు. ముందుగా కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రమ్మను. తాగి తింటూ కేసీఆర్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. నాయకుడు లేని నావ బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌ను జనం చీధరించుకుంటున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పాలన ఫ్రమ్‌ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్‌ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  New Ration Cards | కొత్తగా ఐదు లక్షల రేషన్​ కార్డులు.. కసరత్తు చేస్తున్న అధికారులు