అక్షరటుడే, ఇందూరు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) పోలింగ్​ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్​ను ప్రారంభించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు పోలింగ్​ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 47,981 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 5,762 మంది ఉన్నారు. మొత్తం 135 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్​ కొనసాగనుంది.

Advertisement
Advertisement
Advertisement