అక్షరటుడే, వెబ్డెస్క్: Warangal | వరంగల్ నిట్(National Institute of Technology)లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ – కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22) వరంగల్ నిట్(Warangal NIT)లో బీటెక్ సెకండ్ ఇయర్(B.Tech second year) చదువుతున్నాడు. బుధవారం నుంచి కనపడకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, గురువారం సాయంత్రం కాలేజీకి సమీపంలోని వడ్డేపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తోటి విద్యార్థులను తీసుకెళ్లి చూపించగా, ఆ మృతదేహం హృతిక్ సాయిదే అని వారు నిర్ధారించారు. మార్కులు తక్కువగా రావడంతో హృతిక్ సాయి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.