అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajiv Yuva Vikasam | రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చేయూత అందించడానికి ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు loans అందించనుంది. ఈ రోజుతో (ఏప్రిల్ 14) దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ పథకం కింద లోన్లు పొందడానికి దరఖాస్తు applications చేసుకున్నారు. అయితే వారి ఎపికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka కీలక ప్రకటన చేశారు.
రాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని భట్టి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారులకు పత్రాలు అందిస్తామన్నారు. మండలాల వారిగా లబ్ధిదారులకు రుణం మంజూరు పత్రాలు ఇచ్చే ప్రక్రియ జూన్ 9లోపు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు మూడు రోజుల నుంచి వారం పాటు శిక్షణ ఇస్తామని భట్టి తెలిపారు.