అక్షరటుడే, వెబ్డెస్క్: IPL | క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ (IPL) సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా క్రికెట్ జట్ల యాజమాన్యాలు వేలంలో పాల్గొని ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఈ సందర్భంగా చాలా జట్లలో మార్పులు చోటు చేసుకోవడంతో కెప్టెన్లను కూడా మారుస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్గా భారత ఆల్రౌండర్ అక్షరపటేల్(Axar patel)ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.
IPL | వారిని కొనుగోలు చేసినా..
గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా ఉన్న రిషభ్ పంత్(Rishab Panth)ను ఈ సారి లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజనల్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ కూడా కేఎల్ రాహుల్, డుప్లెసిస్ను కొనుగోలు చేసింది. వీరు గతంలో వేరే టీంలకు కెప్టెన్లుగా వ్యవహరించారు. దీంతో ఢిల్లీ జట్టు పగ్గాలు వీరికే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. కానీ జట్టు మేనేజ్మెంట్ అనుహ్యంగా అక్షర్పటేల్కు బాధ్యతలు అప్పగించింది.
IPL | అదరగొడుతున్న అక్షర్
భారత బౌలింగ్ అల్రౌండర్(All Rounder) గత కొన్ని రోజులుగా అన్ని ఫార్మాట్లలతో చక్కని ప్రతిభ చూపాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ(CT – 2025)లో సైతం నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఐదు ఇన్నింగ్స్లలో మొత్తం 109 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు కూడా తీశాడు.
IPL | జట్టును నడిపిస్తా..
కెప్టెన్సీ బాధ్యతలు తనకు అప్పగించడంపై అక్షర్ పటేల్ స్పందించాడు. ఏళ్లుగా ఢిల్లీకి ఆడుతున్నానని, జట్టును ముందు ఉండి నడిపిస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి కెప్టెన్గా నియమించినందుకు టీం మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలిపారు.