NIZAMABAD CONGRESS | పసుపు బోర్డును హోటల్లో ఎందుకు ప్రారంభించారు..?
NIZAMABAD CONGRESS | పసుపు బోర్డును హోటల్లో ఎందుకు ప్రారంభించారు..?
Advertisement

అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD CONGRESS | పసుపు బోర్డును ఆగమేఘాల మీద ఎందుకు ప్రారంభించారని నిజామాబాద్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి (Muppa Ganga Reddy) ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్​ పార్టీ(congress party) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. అసలు బోర్డు కార్యాలయం ఎక్కడ ఉందో తనకే తెలియదని.. రైతులకు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

NIZAMABAD CONGRESS | విధివిధానాలే ఖరారు కాలేదు..

కనీసం ఇప్పటివరకు పసుపు బోర్డు(Turmeric Board) పాలకవర్గం విధివిధానాలు కూడా ఖరారు కాలేదని ముప్ప గంగారెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి(Rural MLA Bhupathi Reddy) జవహర్ నవోదయ కోసం జక్రాన్​పల్లి(Jakranpally)ని ప్రతిపాదిస్తే, ఎంపీ అర్వింద్(MP Arvind)​ జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలిగోట్​ను ప్రతిపాదించారని గుర్తు చేశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement