అక్షర టుడే, నిజామాబాద్ సిటీ : District court | భర్త వేధింపులు తాళలేక గొంతు నులిమి హత్య చేసిన కేసులో నిందితురాలికి కోర్టు court జీవితఖైదు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. నవీపేట్ మండలం జన్నేపల్లికి Jannapalli, Navipet mandal చెందిన ముక్కల సాయిలు భార్య రేఖను ప్రతిరోజు వేధించేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె గతేదాది ఏప్రిల్లో మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కోర్టులో court ప్రవేశపెట్టగా, విచారించిన న్యాయస్థానం నిందితురాలు రేఖకు జీవిత ఖైదు, అలాగే సాక్ష్యాలు తారుమారు చేసినందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ మూడో సెషన్స్ జడ్జి Nizamabad Third Sessions Judge ఆశలత తీర్చు వెలువరించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డి తెలిపారు.
District court | భర్త హత్యకేసులో భార్యకు జీవితఖైదు
Advertisement
Advertisement