Women’s Power | తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​

తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​
తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Women’s Power : మహిళలు సాధికారత సాధించే వరకు, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా, ఆర్థికంగా నిలబెడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా.. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వయం సహాయక సంఘాల “ఇందిరా మహిళా శక్తి” భారీ బహిరంగ సభలో మహిళల ఆర్థిక తోడ్పాటు కోసం ముఖ్యమంత్రి పలు వరాలు ప్రకటించారు. ఆడబిడ్డలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించిన ముఖ్యమంత్రి.. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలను విశదీకరించారు.

తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​
తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​

Women’s Power : రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత

‘రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు(rice mills) పెట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోనుంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు కట్టించడం, ఆ వడ్లనే మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.’

Women’s Power : ట్రిలియన్ డాలర్ ఎకానమీ

ప్రభుత్వమే స్థలం ఇస్తుంది. ప్రభుత్వమే రుణాలు ఇప్పిస్తుంది. మీరే గోడౌన్లు కట్టండి. మీరే రైసు మిల్లులు పెట్టండి. మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ(Trillion Dollar Economy)గా తయారు చేయాలి. ఆడబిడ్డలు ఎదిగితేనే అది సాధ్యపడుతుంది.

Women’s Power : కోటి మందికి..

‘మహిళా సంఘాల్లో ప్రస్తుతం ఉన్న 65 లక్షల సభ్యుల సంఖ్యను కోటి మందికి పెంచాలి. అందుకు కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయంటే వాటిని సడలించాం. సభ్యత్వం చేరడానికి కనిష్ట వయో పరిమితిని 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించాం. సభ్యత్వం పూర్తి కావడానికి గరిష్ట పరిమితిని 60 నుంచి 65 ఏళ్లకు పెంచాం.’

తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​
తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​

Women’s Power : 1000 ఎలక్ట్రిక్ బస్సులకు ఆడబిడ్డలు యజమానులు

‘ఎవరికో లీజుకు ఇవ్వడంకన్నా ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తాం. ఇప్పుడు 150 బస్సులను ప్రారంభించాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సుల(electric buses)కు ఆడబిడ్డలు యజమానులు కాబోతున్నారు. తద్వారా ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది.’

Women’s Power : చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు

‘చట్ట సభల్లో(legislative assemblies) మహిళలకు రిజర్వేషన్లు(Reservations) వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో 33 శాతం మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి. సమాజ సేవ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావాలి.’

Women’s Power : కార్పొరేట్ కంపెనీలతో పోటీ

‘ఆదిలాబాద్ గిరిజన కళా రూపాలు(tribal art), నిర్మల్ బొమ్మలు, తినుబండారాలు… ఏవైనా కావొచ్చు స్వయం సహాయ సంఘాలు చేసే ఉత్పత్తులను కార్పొరేట్ కంపెనీల(corporate companies)తో పోటీ పడుతూ అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా శిల్పారామం పక్కన 150 షాపులు కేటాయించాం. మీ ఉత్పత్తులపై పన్నులేమైనా ఉంటే రాబోయే రోజుల్లో వాటికి మినహాయింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.’

Women’s Power : 1 కోటి 30 లక్షల విద్యార్థినీ విద్యార్థులకు దుస్తులు

’65 లక్షల మంది సంఘాల్లో ఉన్న వారి పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆ పాఠశాలల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాం. 1 కోటి 30 లక్షల విద్యార్థినీ విద్యార్థులకు దుస్తులు కుట్టించే కార్యక్రమం ఆడబిడ్డలకు అప్పగించాం. కుట్టుకూలి గిట్టుబాటు కావాలన్న ఉద్దేశంతో ధరను రూ. 75 కు పెంచాం.’

తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​
తెలంగాణను అభివృద్ధి పథంలో మహిళల భాగస్వామ్యం : సీఎం రేవంత్​

Women’s Power : 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి

‘జిల్లా కేంద్రాల్లో మహిళా సంఘాలు ఉండాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలని, ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందించే విధంగా ఒప్పందం చేశాం.’ అని చెప్పుకొచ్చారు.

Women’s Power : ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ

అనంతరం ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇదే వేదికగా 2,82,552 సంఘాలకు సంబంధించి రూ. 22794 కోట్ల చెక్కును అందజేశారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. బీమా పథకాల నిధులను విడుదల చేశారు.

Advertisement