Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డా. లిల్లీస్ను, మహిళా అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. అలాగే వివిధ రకాల కేన్సర్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement