అర్హులందరికీ ‘ఆరు గ్యారంటీలు’

Advertisement

అక్షరటుడే, ఎడపల్లి: అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అందిస్తామని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఠాణాకలాన్‌, కుర్నాపల్లి నుంచి నిజామాబాద్‌కు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సును ప్రారంభించామని తెలిపారు. నియోజక వర్గంలోని సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాము పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట, ఠాణాకలాన్‌, కుర్నాపల్లి, మంగళ్‌పాడ్‌, ఎడపల్లి గ్రామాల్లో పర్యటించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLA quota MLC | నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు