అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురికి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీప్రియ నగర్లోని కస్తూర్బా కాలనీలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి ఏడుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు సెల్ఫోన్లు, రూ.30,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.