హైదరాబాద్‌, అక్షరటుడే: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు 36 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ తర్వాత, భద్రతా దళాలు 10 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కుల్హాది ఘాట్ అడవిలో జరిగింది.