అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : ఎడపల్లి మండలం జానకంపేటలో బుధవారం రాత్రి ​అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. మొదట షార్ట్​ సర్క్యూట్​తో మంటలు వ్యాపించినట్లు భావించినా గ్యాస్​ లీకేజీతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.