అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మకు కోర్టు షాక్​ ఇచ్చింది. చెక్​ బౌన్స్​ కేసులో ముంబై అంధేరి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో మహేశ్​ చంద్ర మిశ్రా అనే వ్యక్తి ఆర్జీవీపై చెక్​ బౌన్స్​ కేసు వేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్​ జారీ చేసింది. మూడు నెలల జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారునికి రూ.3.72 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.