అక్షరటుడే, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 65,278 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,077 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.3.7 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.