అక్షరటుడే, ఇందూరు: ఉత్తమ ఫీచర్లు.. అత్యుత్తమ మైలేజీతో నూతన డెస్టినీ 125 స్కూటర్ రూపొందించడం అభినందనీయమని నూడా ఛైర్మన్ కేశ వేణు అన్నారు. నగరంలోని వినాయక నగర్లో గల వెంకటేశ్వర హీరో షోరూంలో గురువారం నూతన స్కూటర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు సులభతరంగా నడిపేలా వాహనాన్ని రూపొందించారన్నారు. యజమాని మహిపాల్ రెడ్డి, జయరెడ్డి, జీఏం సందీప్, సేల్స్ మేనేజర్ వినీత్, నెట్వర్క్ మేనేజర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.