అక్షరటుడే, వెబ్డెస్క్: అండర్–19 మహిళా టీ–20 ప్రపంచ్కప్ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బౌలర్లు, బ్యాటర్లు విజృంభించడంతో భారత జట్టు సునాయాసంగా విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాను భారత బౌలర్లు 82 పరుగులకే అలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇండియన్ టీం 11.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. తెలంగాణ క్రీడాకారిణి గొంగడి త్రిష 44 పరుగులతో రాణించింది.