అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని వినాయక్నగర్ సబ్స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్ ఏడీఈ వీరేశం తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగిస్తున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. గాయత్రి నగర్ రోడ్ నంబర్ 1, 2, 3, 4, 5, ఆకుల పాపయ్య కాలనీ, చింత చెట్టు మైసమ్మ, కాశీనగర్, సిద్ధి వినాయక రోడ్, ఆర్యవైశ్య సంఘం, న్యాల్కల్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.