అక్షరటుడే, వెబ్డెస్క్: బడ్జెట్లో రైల్వేశాఖ కేటాయింపులపై ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లకు భారీగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఏపీకి రూ.9,147 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని కేంద్ర మంత్రి తెలిపారు. నవ భారత్ రైళ్లను విజయవాడ-హైదరాబాద్ మధ్య నడపాలని నిర్ణయించామని పేర్కొన్నారు.