అక్షరటుడే, ఇందూరు: జాతీయస్థాయి క్రీడల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు కేరళలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లావాసులు 22 పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను మాస్టర్స్​ అథ్లెటిక్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి గోపిరెడ్డి, ట్రెజరర్ నీతారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కిరణ్ కుమార్ అభినందించారు.