అక్షరటుడే, వెబ్​డెస్క్​: తెలంగాణ శాసనసభ స్పీకర్​ కార్యాలయం నుంచి తమకు నోటీసులు అందాయని బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేలు సంజయ్​, వెంకట్రావు పేర్కొన్నారు. న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలియజేశారు.