అక్షరటుడే, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ తలిగింది. ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ నామినేషన్ వేశారు. ఆ స్థానానికి నరేందర్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన స్థానాన్ని వేరే అభ్యర్థికి ప్రకటించడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కాగా.. ఆ స్థానానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన డీఎస్పీ గంగాధర్ సైతం కాంగ్రెస్ టికెట్ను ఆశించారు.