అక్షరటుడే, వెబ్​డెస్క్​: బేగంపేట ఎయిర్​పోర్ట్​లో గురువారం ప్రమాదం జరిగింది. ట్రెయినీ ఎయిర్ క్రాఫ్ట్​​ ల్యాండ్​ అవుతున్న సమయంలో అదుపు తప్పి ​పక్కకు ఒరిగిపోయింది. ఈ క్రమంలో ఎయిర్​ క్రాఫ్ట్​ ముందు చక్రం వంగిపోవడంతో రన్​వేను చీల్చుకుంటూ వెళ్లింది. ప్రమాదం నుంచి పైలెట్​ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో రన్​వే దెబ్బతినగా అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు.